Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ రెయిన్స్ ఎఫెక్ట్ : పూరానాపూల్‌ వంతెన కు భారీ పగుళ్ళు..

మూసీ ఉగ్రరూపానికి పూరానాపూల్‌ లో నది పై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి.


మూసీ ఉగ్రరూపానికి పూరానాపూల్‌ లో నది పై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి. దీంతో పోలీస్‌ అధికారులు ముందు జాగ్రత్తగా వంతెన నుంచి రాకపోకలు నిలిపి వేశారు. వారం రోజుల్లో రెండు సార్లు హైదరాబాద్‌లో వర్షం కురిసింది. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షానికి వరద మూసీని ముంచెత్తింది. జియాగూడ, కార్వాన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ ను పూరానాపూల్‌ నుంచి అఫ్జల్‌ గంజ్‌ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్‌ టీం ను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు