హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన గుడిసెలు..
హైదరాబాద్, బోయినపల్లి బాపూజీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్, బోయినపల్లి బాపూజీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న గుడిసెలు తగలబడ్డాయి. సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి మంత్రి మల్లారెడ్డి చేరుకుని బాధితులను పరామర్శించారు.