Asianet News TeluguAsianet News Telugu

మూసాపేట మెట్రో స్టేషన్ కింద పిల్లర్ వద్ద కుంగిన భూమి (చూడండి)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మెట్రో రైలుకు ముప్పు పొంచి ఉంది. 


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మెట్రో రైలుకు ముప్పు పొంచి ఉంది. మూసాపేట వద్ద భూమి కుంగిపోయింది. భారీ వర్షాలకు ఈ సంఘటన సంభవించింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్ చుట్టూ ఉన్న సెక్యురిటీ వాల్ కొట్టుకుపోయింది. పిల్లర్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడింది. వరద తాకిడికి ఇది ఏర్పడింది.

సర్ఫేస్ వాల్ మీద పిల్లర్ ను నిర్మించడం వల్ల ఈ ఇది సంభవించినట్లు భావిస్తున్నారు. రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. ఎల్బీనగర్, మియాపూర్ మధ్య మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. అయితే, మెట్రో సురక్షితంగా ఉందని, ఏ విధమైన ప్రమాదం లేదని ఎండీ చెప్పారు.