Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరాహార దీక్షలు.. ఎందుకంటే..

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయరంగానికి, సాగునీటికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయరంగానికి, సాగునీటికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అందుకే పీసీసీ అధ్యక్సుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వాళ్ల వాళ్ల ఇళ్లల్లో నిరాహార దీక్ష చేయాలని పిలుపునిస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా కుందుర్గు మండలం షాదనగర్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికే నిరాహారదీక్ష చేయాలని కోరుకుంటున్నాం.