Asianet News TeluguAsianet News Telugu

మెదక్ లో ఆరోవిడత హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో కేసీఆర్ తోపాటు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని అన్నారు. భవిష్యత్తులో కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఇప్పటికే 92వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నామని, సమిష్టి కృషితో నర్సాపూర్ అడవిని పునరుజ్జీవం చేయచ్చని అన్నారు.