Asianet News TeluguAsianet News Telugu

బిఎల్ సంతోష్ కనబడుటలేదు... ఆచూకీ చెబితే 15 లక్షల బహుమానం : వాల్ పోస్టర్లు కలకలం

 హైదరాబాద్ : తమ ఎమ్మెల్యే కొనుగోలుకు వ్యవహారంలో బిజెపి సీనియర్ నాయకుడు బిఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. 

 హైదరాబాద్ : తమ ఎమ్మెల్యే కొనుగోలుకు వ్యవహారంలో బిజెపి సీనియర్ నాయకుడు బిఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. డిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కవిత ఇటీవల ఈడీ విచారణకు హాజరుకాగా... సంతోష్ మాత్రం సిట్ విచారణకు హాజరవడం లేదు. దీంతో ఎమ్మెల్సీ కవితను ధైర్యవంతురాలని... సంతోష్ పిరికిపంద అంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్దహస్తుడు సంతోష్ కనిపించడం లేదు... ఆయన ఆచూకీ తెలిపితే ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు బహుమానం అంటూ హైదరాబాద్ లో వాల్ పోస్టర్లు వెలిసాయి. ఈ పోస్టర్లు రాజకీయ చర్చకు దారితీసాయి.