Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020 : రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్.. గెలిచేదెవరో..

ఐపీఎల్ 2020లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడబోతోంది.

ఐపీఎల్ 2020లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడబోతోంది. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిపోయిన కింగ్స్ ఎలెవన్ ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో ఉంది. ఇక హైదరాబాద్ టీం మీద ఇప్పటికే ఓ విజయాన్ని నమోదు చేసుకున్న కోహ్లీ టీం ఈ మ్యాచ్ లో కూడా గెలవాలన్న కసితో ఉంది. ఈ రెండు టీంలూ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఫైనల్ కయితే వెళ్లాయి కానీ కప్పు గెలవలేదు. కాబట్టి ఈ రెండు టీం ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్ టఫ్ గా ఉండబోతోందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి చెబుతున్నారు..