Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లా లో వివో ఫోన్ పేలి త్రుటిలో తప్పిన ప్రమాదం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కయ్యం సంపత్ అనే వ్యక్తి 6 నెలల క్రితం వివో మొబైల్ కొనుగోలు చేశాడు . 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కయ్యం సంపత్ అనే వ్యక్తి 6 నెలల క్రితం వివో మొబైల్ కొనుగోలు చేశాడు . అయితే ఆదివారం గ్రామం నుండి మండల కేంద్రానికి వచ్చి రాజస్థాన్ హోటల్ లో ఫ్రెండ్ తో టీ తాగుతుండగా నే అకస్మాత్తుగా వివో మొబైల్ పేలి భారీ శబ్దం రావడంతో ఒకేసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  మొబైల్ బైక్ లో పెట్టి టీ తాగడం వల్లనే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఒకవేళ మొబైల్ వ్యక్తి దగ్గర ఉంటే ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలుపుతున్నారు.