Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసి సమ్మె... బస్సులన్నీ రోడ్లపైకి వచ్చాయి: కలెక్టర్ దేవసేన (వీడియో)

ఆర్టిసి సమ్మె ప్రభావం ఎలా వుందో తెలుసుకునేందుకు కరీంనగర్ కలెక్టర్ దేవసేన ప్రయత్నించారు. మంథని బస్ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె సమ్మె ప్రభావం గురించి స్పందించారు.  

కరీంనగర్: మంథని ఆర్టీసీ బస్సు డిపోను జిల్లా కలెక్టర్ దేవసేన ఆకస్మికంగా సందర్శించారు. కార్మికుల సమ్మె సందర్బంగా బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి... ప్రయాణికుల సమస్యల గురించి తెలుసుకునేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. అయితే ఓవైపు సమ్మె నడుస్తున్నా మరోవైపు 98% బస్సులు రోడ్లపైకి  వచ్చాయని ఆమె వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తాత్కాలిక సిబ్బంది ఎక్కువ చార్జీలు తీసుకోకుండా టింగ్  మిషన్ల వినియోగంపై  శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ప్రారంభం అవుతున్న క్రమంలో విద్యార్థులకు బస్సు పాస్ లు ఇవ్వాలని...అందుకోసం అధికారులు పర్యవేక్షణకు ఆదేశించారు.

Video Top Stories