Asianet News TeluguAsianet News Telugu

టాయిలెట్లకు ఆధునిక హంగులు.. మహిళలకు ప్రత్యేకం.. గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్లో ఆరవ విడత హరితహారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు.

కరీంనగర్ టౌన్లో ఆరవ విడత హరితహారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. అనంతరం ప్రజల కోసం హైజనిక్ టాయిలెట్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.  నగరంలో బయటకి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి  ఆ ప్రాంతాలలో నూతనంగా  అధునాతనమైన15 టాయిలెట్స్  నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో మహిళలకు, చిన్న పిల్లలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయని అన్నారు.  బయటకు వచ్చిన మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

Video Top Stories