Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ కార్పొరేటర్ తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

కరీంనగర్ లో బీజేపీ కార్పోరేటర్ సోదరునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

కరీంనగర్ లో బీజేపీ కార్పోరేటర్ సోదరునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండబూతులు తిడుతూ, చావచితగ్గొట్టారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి శివార్లలోని భూ వివాదమే ఈ దాడికి కారణమని పోలీసులు 
చెబుతున్నారు. బీజేపీకి చెందిన కార్పోరేటర్ కొలగాని శ్రీనివాస్ సోదరుడు విద్యాసాగర్ పై తీగలగుట్టపల్లిలో ఆదివారం మద్యాహ్నం 23 మంది దాడి చేశారు. ఎలుగ శ్రీనివాస్, ఎలుగ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్ లతో పాటు మరో 20 మంది దాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.