Asianet News TeluguAsianet News Telugu

భూ వివాదం : మాటు వేసి కర్రలతో దాడి.. భార్య, భర్తలను చితకబాదిన ప్రత్యర్థులు..

కరీంనగర్ రూరల్  నగునూరు గ్రామంలో ఓ భూ వివాదంలో ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి. 

కరీంనగర్ రూరల్  నగునూరు గ్రామంలో ఓ భూ వివాదంలో ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి.నగునూరు గ్రామానికి చెందిన మల్లయ్య మీద అదే గ్రామానికి చెందిన రాకేష్, భిక్షపతి అనే తండ్రి కొడుకులు కర్రలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మల్లయ్య భార్యను కూడా కర్రలతో చితకబాదారు. ఇదంతా సీసీ టీవీ లో రికార్డ్ అవ్వడంతో విషయం బైటికి వచ్చింది. కొన్నేళ్లుగా భూమి విషయంలో వీరి మధ్య పంచాయతీ కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదు కూడా చేసుకున్నాయి. తాజాగా ఈ ఘటనతో భూ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. 

Video Top Stories