Asianet News TeluguAsianet News Telugu

చెవిలో పువ్వులు.. చేతిలో కొబ్బరికాయలు.. ఎందుకంటే..

కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం షానగర్ వద్ద వరద కాలువ పనులు ప్రారంభం కాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 

కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం షానగర్ వద్ద వరద కాలువ పనులు ప్రారంభం కాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.  గత యేడాది 165 కోట్లతో నిర్మాణం తలపెట్టిన మోతే కాలువ యేడాది గడుస్తున్న పనులు ప్రారంభించకపోవడంతో చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్  ఇంచార్జీ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని,కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. శిలాఫలకలపై ఉన్న శ్రధ్ధ కాలువల నిర్మాణం పై లేదని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పిన నాయకులు ఏడాది గడుస్తున్న పనులు ప్రారంభించలేదని మేడిపల్లి సత్యం అన్నారు. పనులు వెంటనే ప్రారంభించాలి లేదంటే టిఆర్ఎస్ నాయకులని అడ్డుకుంటామని హెచ్చరించారు.