Asianet News TeluguAsianet News Telugu

చెత్త తగలబెడుతుంటే.. పేలిన జిలెటిన్ స్టిక్స్..

కరీంనగర్ జిల్లా,  గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లిలో 150కి పైగా జిలెటిన్ స్టిక్స్ ఉన్న గోనెసంచి లభ్యమయ్యింది. 

కరీంనగర్ జిల్లా,  గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లిలో 150కి పైగా జిలెటిన్ స్టిక్స్ ఉన్న గోనెసంచి లభ్యమయ్యింది. దీంతో ఉపాధి హామీ కూలీలకు పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు పనిలో భాగంగా చెత్తను తగలబెడుతుండగా పదుల సంఖ్యలో డిటోనేటర్లు పేలాయి. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. గోనెసంచిలో పెట్టి చెట్టుకింద పెట్టినట్టుగా పరిశీలనలో తేలింది. వీటిని పెట్టిన 
వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Video Top Stories