Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. నగరంలోని ఉజ్వల పార్క్ లోని పీవీ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూల మాల వేసి అంజలి ఘటించారు. సీఎంగా ఉన్నప్పుడు భూసంస్కరణలు.. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన మహానేత, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సీఎం కేసిఆర్ పిలుపు మేరకు ఏడాది పొడవునా పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు భారీ కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Video Top Stories