Asianet News TeluguAsianet News Telugu

చనిపోయిన వాళ్లం బతికొచ్చాం.. న్యాయం చేయండి.. రైతుల ఆవేదన..

కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం బొమ్మానపల్లికి చెందిన ఓ రైతు కుటుంబం చనిపోయారని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమిని వేరే వారి పేరుమీద మార్చారు. 

కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం బొమ్మానపల్లికి చెందిన ఓ రైతు కుటుంబం చనిపోయారని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమిని వేరే వారి పేరుమీద మార్చారు. మేము బతికే ఉన్నాం మా భూమిని అలా ఎలా మారుస్తారంటూ ఆ రైతు కుటుంబం కలెక్టర్ కారుకు అడ్డంగా పడుకుని న్యాయం కావాలంటూ రోధిస్తుంది. తమకు న్యాయం జరగాలని, తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.