Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజిల్ ధరల మీద కొటారి బత్తాయిలు స్పందించరా.. సిపిఎం

కరీంనగర్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం కొత్తపల్లి జోన్ కమిటీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. 

కరీంనగర్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం కొత్తపల్లి జోన్ కమిటీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.  బండ్లను నీటిలో నిమజ్జనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి బైక్ లను తాళ్లతో లాగుతూ ఊరి చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఊరి చేరువులో పడేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడికందుల సత్యం మాట్లాడుతూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న క్రమంలో మన దేశంలో పన్నుల రూపంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు దోచుకుంటూ 20 రోజులుగా సుమారుగా పది రూపాయల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.