Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్ అందక కరోనాతో వృద్ధుడి మృతి.. బెడ్ పై నుంచి కిందపడ్డా...

కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని కరోనా వార్డులు దారుణం జరిగింది. 

కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని కరోనా వార్డులు దారుణం జరిగింది. కరోనా చికిత్స తీసుకుంటున్న ఓ వృద్ధుడు ఆక్సీజన్ అందక మృతి చెందాడు. ఆక్సీజన్ కోసం వెతుక్కుంటున్న సమయంలో బెడ్ మీదినుండి జారి కింద పడ్డాడు. గంగాధర మండలానికి చెందిన  ఓ వృద్దుడు శ్వాశ కోస ఇబ్బందులతో 24న ఆస్పత్రిలో చేరాడు. అయితే ఇంత జరిగినా సిబ్బంది చూస్తూ ఉన్నారే కానీ, దగ్గరికి వెళ్లి పట్టించుకోకపోవడం విషాదం. మిగిలిన పేషంట్లు ఫొటోలు, వీడియోలు తీయడంతో అవి వైరల్ గా మారాయి.