Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో రోడ్డు ప్రమాదం...విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ దాదాపు 20 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల స్కూల్ ఆటో బోల్తా 20 మందికి విద్యార్థులు గాయపడ్డారు. గుత్తికొండ హైస్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని పిడుగురాళ్ల తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా  పడింది. ఈ ప్రమాదం నుండి పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి  జిల్లా పరిషత్ హైస్కూల్ చెందిన బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ విద్యార్థినులను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.