video:పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మిక తనిఖీ
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరుగాలాల పాటు కష్టపడి పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ ను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవీ తనిఖీ చేశారు. మార్కెట్ యార్డ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా మార్కెట్ యార్డ్ సిబ్బంది చొరవ చూపాలని.... ధరల విషయంలో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని మార్కెట్ యార్డ్ సిబ్బందికి సూచించారు. మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పర్యటిస్తూ... రైతులతో ధరల విషయం అడిగి తెలుసుకున్నారు. ధరలు 300 నుండి 1000 రూపాయలు వరకు పోవడంతో రైతులు తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్యేకు తెలిపారు. వ్యాపారస్తులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల నుండి కమిషన్ తీసుకోకుండా మార్కెట్లో టమోటాను కొనుగోలు చేయాలని సూచించారు.