Asianet News TeluguAsianet News Telugu

మహానందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి పర్యటన (వీడియో)

కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్టోగి సందర్శించారు. 

కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్టోగి సందర్శించారు.

సోమవారం సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన అజయ్ దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, వేద పండితులు రవిశంకర్ అవధాని,  ప్రధాన అర్చకులు అర్జునశర్మ, ఆలయ సూపరిండెంటెంట్  ఓంకారం వెంకటేశ్వరుడు, ఇన్స్పెక్టర్ సురేంద్రనాధ్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులు శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

అనంతరం అలంకార మండపంలో రస్తోగి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అజయ్ రస్తోగి వెంట నంద్యాల న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి తదితరులు ఉన్నారు.