Asianet News TeluguAsianet News Telugu

video news : ఎమ్మెల్యే ఇంటిముందు వృద్ధురాలి ధర్నా..ఎందుకంటే...

చిత్తూరు జిల్లాలో 75యేళ్ల ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే ఇంటిముందు ధర్నా చేసింది. బేరుపల్లె గ్రామానికి చెందిన లేట్ మునుస్వామి భార్య చెంగమ్మ గత రెండు సంవత్సరాలుగా వృద్యాప్త పెన్షన్ రాలేదని ఎమ్మెల్యే ఇంటి దారిలో పెన్షన్ ఇవ్వాలన్న ఫ్లకార్డ్ తో నిరసన తెలిపింది.

చిత్తూరు జిల్లాలో 75యేళ్ల ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే ఇంటిముందు ధర్నా చేసింది. బేరుపల్లె గ్రామానికి చెందిన లేట్ మునుస్వామి భార్య చెంగమ్మ గత రెండు సంవత్సరాలుగా వృద్యాప్త పెన్షన్ రాలేదని ఎమ్మెల్యే ఇంటి దారిలో పెన్షన్ ఇవ్వాలన్న ఫ్లకార్డ్ తో నిరసన తెలిపింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను స్థానిక ఎంపిడిఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎంపీడీవో దయానందం ఆమె పెన్షన్ పుస్తకాన్ని పరిశీలించి మూడునెలలు పెన్షన్ తీసుకోనందున ఆమె పేరును తొలగించారని, మరలా ఆమె పేరును నమోదు చేసి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.