Asianet News TeluguAsianet News Telugu

స్కూప్‌ షాట్‌తో ఏబీడీని గుర్తుకు తెచ్చిన విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించింది టీమిండియా. కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించగా ఆఖర్లో హార్ధిక్ పాండ్యా సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అయితే 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఓ స్కూప్ షాట్‌తో సిక్సర్ బాది ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తుకు తెచ్చాడు.