హైదరాబాద్ ని వెంటాడిన దురదృష్టం, బెంగళూరును గెలిపించిన కోహ్లీ కెప్టెన్సీ
IPL 2020 సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.
IPL 2020 సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 15.1 ఓవర్లలో 121/2 పరుగులతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, సులువుగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.