Asianet News TeluguAsianet News Telugu

ముంబై వర్సెస్ కోల్‌కత : రస్సెల్ ని సైలెంట్ చేయడం నేర్చుకున్న ప్రత్యర్థులు

IPL 2020 సీజన్‌లో మరో డామినేటింగ్ విజయంతో టేబుల్ టాప్‌లోకి వెళ్లింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్

IPL 2020 సీజన్‌లో మరో డామినేటింగ్ విజయంతో టేబుల్ టాప్‌లోకి వెళ్లింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. 149 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ, డి కాక్ కలిసి మొదటి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 6 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రోహిత్ శర్మను అవుట్ చేయగా... సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి లాంఛనాన్ని ముగించాడు డి కాక్... 16.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన ముంబై, 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...