Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020 : చెన్నైలో రాయుడు లేని లోటు.. ఢిల్లీకే గెలుపు అవకాశాలు..

ఐపీఎల్ 2020 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అబుదాబిలో మ్యాచ్ జరగనుంది. 

ఐపీఎల్ 2020 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అబుదాబిలో మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో యంగ్ స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇది కూడా చాలా టఫ్ టీమ్. వీళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద గెలిచి విజయం జోరులో ఉన్నారు. సో రెండు టీంలు పోటాపోటీ తలపడనున్నాయి. రాయుడు కంబ్యాక్ అనేది చాలా కీలకంగా మారనుంది. గాయాలు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టనున్నాయి. ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్ గా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీంల మద్య మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారనుందని చెబుతున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి.