Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులకు అమ్మవారి ఆశిస్సులు... వెయ్యి కొబ్బరికాయలతో వైసిపి ఎమ్మెల్యే మొక్కు

విశాఖపట్నం :  వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అన్నిప్రాంతాల అభివృద్దికి కాంక్షిస్తూ తీసుకున్న మూడురాజధానుల నిర్ణయం ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలయ్యేలా చూడాలంటూ అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు వైసిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.

విశాఖపట్నం :  వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అన్నిప్రాంతాల అభివృద్దికి కాంక్షిస్తూ తీసుకున్న మూడురాజధానుల నిర్ణయం ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలయ్యేలా చూడాలంటూ అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు వైసిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. నవరాత్రి వేడుకల్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా స్వలాభం కోసం కేవలం ఒకే ప్రాంత అభివృద్దిని కోరుతూ మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసేలా వ్యవహరించేవారి మనసులు మార్చాలని అమ్మవారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ఆ అమ్మవారి ఆశిస్సులు తోడవ్వాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గణేష్ తెలిపారు.