కేవలం వాహనానికి దారి ఇవ్వలేదని... యువకున్ని కొట్టిచంపిన దుండగుడు

 
గుంటూరు: చిన్న విషయంలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. 

First Published Feb 16, 2022, 3:11 PM IST | Last Updated Feb 16, 2022, 3:11 PM IST

 
గుంటూరు: చిన్న విషయంలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని గుర్రాల చావడిలో ఇద్దరు యువకులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో తన వాహనానికి దారి ఇస్తే ముందుకు వెళతానని ఇస్మాయిల్ ను బాజీ కోరాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన బాజి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాజీని అదుపులోకి తీసుకున్నారు.