
ఎంపీ నందిగం సురేశ్కి రాజధాని సెగ
వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేశ్కి రాజధాని సెగ ఎదురైంది.
వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేశ్కి రాజధాని సెగ ఎదురైంది. ఆదివారం నందిగామకు వచ్చిన ఆయనకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గులాబీ పూలతో స్వాగతం పలికారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ముందుకు సాగడంతో పాటు మీ అంతు చూస్తానంటూ విద్యార్ది సంఘాల నాయకులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఎంపీ వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
