అపరగాంధీ సీఎం జగన్.. అది ఆయనవల్లే సాధ్యం.. ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు జిల్లా పెదపరిమిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్రావుతో కలిసి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు.
గుంటూరు జిల్లా పెదపరిమిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్రావుతో కలిసి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. గాంధీలా జగన్ కూడా తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు దగ్గరుండి చూసారని అందుకే నేను వున్నాను,నేను విన్నాను అంటూ జగన్ ప్రజల కష్టాలు తీరుస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాటు మాత్రమే ఉంటుందని, కొంతమంది రబ్బర్ లా పాలన సాగదిస్తూ వుంటారని చురకలంటించారు. సీఎం జగన్ మాత్రం ఒక నవ శఖానికి నాంది పలికారన్నారు. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం సీఎం జగన్ ద్వారా సాధ్యమని, నేటి తరం బాపూజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు