Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన... ఉద్రిక్తత

తాడేపల్లి : స్టూడెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 

తాడేపల్లి : స్టూడెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘం నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలతో కూడిన బ్యానర్, ఎస్ఎఫ్ఐ ప్లకార్డులతో కార్యాలయం వద్దకు చేరుకుని సీఎం జగన్ కువ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.