Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో పాము కలకలం...భయంతో పరుగుతీసిన ఉద్యోగులు

మచిలీపట్నం : కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో త్రాచు పాము కలకలం సృష్టించింది. మచిలీపట్నంలోని కలెక్టరేట్ భవనంలోని పాము ప్రవేశించింది. 

మచిలీపట్నం : కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో త్రాచు పాము కలకలం సృష్టించింది. మచిలీపట్నంలోని కలెక్టరేట్ భవనంలోని పాము ప్రవేశించింది. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ పక్కనేవున్న క్యాబిన్ లో నాలుగు అడుగుల పెద్ద తాచుపామును చూసి ఉద్యోగులు భయంతో పరుగుతీసారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పాములుపట్టే వ్యక్తిని పంపించారు. అతడు చాకచక్యంగా పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.