Asianet News TeluguAsianet News Telugu

వాసన పసిగట్టలేకపోవడమూ కరోనా లక్షణమే.. ఎంపీ సత్యవతి

విశాఖ జిల్లా, అనకాపల్లి గవరపాలెంలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ లు పర్యటించారు. 

విశాఖ జిల్లా, అనకాపల్లి గవరపాలెంలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ లు పర్యటించారు. కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో అధికారులు కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించారు. దీనిపై స్థానికులు తమకు సడలింపు ఇవ్వాలని కోరడంతో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడెక్కడ సడలింపు ఇవ్వాలో అధికారులకు సూచించారు. కంటోన్మెంట్ పరిధి తగ్గించాలని చెప్పారు. పర్యటనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సత్తమ్మతల్లి ముఖద్వారం, పార్క్ సెంటర్ రహదారి, సంతోషిమాత ద్వారం రహదారి మరికొన్ని చెక్ పోస్టులను ఎత్తి వేయమని జీవీఎంసీ, పోలీస్ అధికారులకు సూచించారు.