Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర బంధానికి అడ్డుగావుందని... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లి

విశాఖపట్నం: మానవ సంబంధానికి మచ్చలా నిలిచే దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం: మానవ సంబంధానికి మచ్చలా నిలిచే దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం మధురవాడలోని మారికవలసలో ఓ తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని మూడేళ్ళ కూతురుని అతి దారుణంగా హతమార్చింది. ఎవరికీ తెలియకుండా చిన్నారి దహనసంస్కారాలు కూడా పూర్తిచేసిన తర్వాత ఈ దారుణం బయటపడింది.

వరలక్ష్మి అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీశ్ రెడ్డి అనే మరో వ్యక్తితో సహ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందని కన్న కూతురిని హతమార్చింది ఈ కసాయి తల్లి. సొంత కూతురిని హత్య చేసినట్లు తెలియగానే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వరలక్ష్మిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని నిందితురాలిని అక్కడి నుండి తరలించారు.