Asianet News TeluguAsianet News Telugu

షాక్.. ఏపీలో ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..

జులై 8న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ తెలిపారు. 

జులై 8న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ తెలిపారు. కొంతమంది టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడం వల్లే ఈ ఆలస్యం అని అన్నారు. న్యాయంగా చేసే పనికి దేవుడి ఆశీర్వాదాలుంటాయని, ధర్మం గెలుస్తుందని అన్నారు. ఆగస్ట్ 15న ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా 30 లక్షల మంది పేదలకు కూడా స్వతంత్ర్యం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టుగా తెలిపారు. 

Video Top Stories