Asianet News TeluguAsianet News Telugu

జోగి రమేష్ ఓ పోరంబోకు... ఆ మహిళా మంత్రిని లోబర్చుకుని..: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

మచిలీపట్నం : పవన్ కళ్యాణ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. 

మచిలీపట్నం : పవన్ కళ్యాణ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. తాగుబోతు రమేష్ కు రాత్రి తాగింది దిగక హ్యాంగోవర్ లో పవన్ గురించి మాట్లాడివుంటాడని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో పోరంబోకు మంత్రి పిచ్చికుక్కలా మాట్లాడుతుంటే సీఎం జగన్  తైతక్కలాడుతూ తెగ నవ్వడం దారుణమన్నాడు. మహిళా మినిస్టర్స్ నే కాదు మహిళా ఉద్యోగులను సైతం జోగి రమేష్ లోబర్చుకున్నాడంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎక్కడికి వెళ్లినా మహిళలపై కన్నేసే వీడో సైకోపాథిక్ వుమనైజర్ అంటూ మంత్రి జోగి రమేష్ పై రామకృష్ణ తీవ్ర కామెంట్స్ చేసారు.