Asianet News TeluguAsianet News Telugu

తిరుమలకు పోటెత్తిన భక్తజనం... శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల ఏడుకొండలు భక్తజనసంద్రగా మారి గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి  20గంటల సమయం పడుతోంది.  భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 కంపార్ట్మెంట్స్ నిండి ఉన్నాయి. నారాయణగిరి షెడ్ లోనూ భారీగా భక్తులు క్యూలైన్ లో వేచివున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులను అన్నప్రసాదం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.