Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఆర్ధిక మూలలను దెబ్బతీయడానికే గీతం కూల్చివేతలు.. నిమ్మకాయల చినరాజప్ప

జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి లేదు కానీ సంస్థలు మూలపడుతున్నాయని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.

జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి లేదు కానీ సంస్థలు మూలపడుతున్నాయని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు. గీతం విశ్వవిద్యాలయం పై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చినరాజప్ప అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గీతం యూనివర్సిటీ కూల్చడాలను ఖండిస్తున్నామని అన్నారు.