Asianet News TeluguAsianet News Telugu

ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో టిడిపి నాయకులు నరేంద్రను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకు తోసేసి ధూళిపాళ్లను హాస్పిటల్ లోకి తరలించారు.