Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

First Published Dec 16, 2022, 3:31 PM IST | Last Updated Dec 16, 2022, 3:31 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఉదయం అధికారులెవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సచివాలయంలోని మూడవ బ్లాక్ కు చేరుకుని ఉద్యోగుల హాజరును పరిశీలించారు. ఆ బ్లాక్ లో వున్న మహిళా శిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యాటక శాఖల ఉద్యోగులు సమయానికి వస్తున్నారో లేదో హాజరుపట్టిక పరశీలించారు. అలాగే పలువురు ఉద్యోగుల సీట్ల వద్దకు వెళ్లిన సీఎస్ వారి పనితీరును పరశీలించారు.