ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం...
గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో మాచర్ల ఎక్స్ ప్రెస్ కంటెయినర్ని ఢీ కొట్టింది.
గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో మాచర్ల ఎక్స్ ప్రెస్ కంటెయినర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంటెయినర్ ని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.