Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్... రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు

విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 

విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలతో సమావేశం ముగిసిన తర్వాత జగన్ నేరుగా శారదా పీఠానికి చేరుకొన్నారు. శారదా పీఠం వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని రాజశ్యామల యాగం నిర్వహించగా ఈ యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి, దాసాంజనేయ స్వామి  ఆలయాలను కూడా సీఎం సందర్శించారు. అనంతరం శారదాపీఠం వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. అలాగే విశేష పండితులకు సీఎం జగన్ చేతులమీదుగా సత్కారం జరిగింది.