Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి వాగులో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. 

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లి వద్ద వాగులో నీటి ప్రవాహ ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు ఇద్దరు గల్లంతయ్యారు. ఓ మహిళ, కారు డ్రైవర్ బయటపడ్డారు. వారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన ఈ కుటుంబం ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.