Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ పై సర్పంచ్ ల పోరాటం... పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తత

గుంటూరు : 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఏపీ సర్పంచ్ ల సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. 

గుంటూరు : 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఏపీ సర్పంచ్ ల సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడికి సిద్దమయ్యారు సర్పంచులు. ఒక్కసారిగా సర్పంచులందరు పంచాయతీరాజ్ కమిషనరేట్ వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సర్పంచులను అడ్డుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.691 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు విడుదల చేయాలని... సర్పంచుల గౌరవ వేతనాన్ని 3000 నుంచి 15 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు.