Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ సాక్షిగా అమరావతే రాజధాని... బిజెపి స్టాండ్ ఇదే..: సోము వీర్రాజు

గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న నిర్ణయానికే బిజెపి కట్టుబడి వుందని...

First Published Mar 15, 2023, 5:04 PM IST | Last Updated Mar 15, 2023, 5:04 PM IST

గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న నిర్ణయానికే బిజెపి కట్టుబడి వుందని... పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్ఫష్టం చేసిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖ నుండే పరిపాలన సాగిస్తానని సీఎం జగన్ చెబుతున్నారని... అసలు విశాఖను ఏం అభివృద్ది చేసారని రాజదానిని తరలిస్తారని ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ అభివృద్దికి 25 వేల కోట్లు ఖర్చుచేసింది... కానీ రాజదాని అని చెప్పుకునే జగన్ మాత్రం రూ.250 కోట్లు కూడా ఖర్చుచేయలేదని వీర్రాజు ఎద్దేవా చేసారు. ఇవాళ(బుధవారం) కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా వుందన్నారు.