Asianet News TeluguAsianet News Telugu

అంబటి రాయుడికి అమరావతి సెగ... అడ్డుకుని నిలదీసిన సొంత జిల్లా రైతులు

అమరావతి : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి సొంత రాష్ట్రంలో నిరసన సెగ తగిలింది. 

అమరావతి : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి సొంత రాష్ట్రంలో నిరసన సెగ తగిలింది. ఇవాళ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్న రైతులు అంబటిని కలిసారు. ఈ సందర్భంగా రాజధాని ఉద్యమానికి మద్దతు ఇవ్వకున్నా కనీసం తమ సమస్యలనయినా వినాలంటూ రాయుడిని కోరారు. కానీ ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటూ చిరునవ్వుతో అంబటి రాయుడ అక్కడినుండి వెళ్ళిపోయారు. దీంతో అంబటి రాయుడు తీరుపై అమరావతి రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.