Asianet News TeluguAsianet News Telugu

ఆర్-5 జోన్ లో నిలిచిన ఇళ్లనిర్మాణం... అమరావతి రైతులు సంబరాలు

అమరావతి : ఆర్‌-5 జోన్ లో వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. 

అమరావతి : ఆర్‌-5 జోన్ లో వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఆర్-5 జోన్ లో సెంటు భూమిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు ప్రకటించి ఇటీవల స్వయంగా సీఎం జగనే శంకుస్థాపన కూడా చేసిన విషయం తెలిసిందే. కానీ అమరావతి రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించడంతో లే అవుట్లలో గృహ నిర్మాణ పనులు నిలిచపోయాయి. నిర్మాణ పనులు చేపడుతున్న  ప్రోక్లేన్లు, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు కూడా పనులకు రాకపోవడంతో ఆర్-5 జోన్ లే ఔట్లు నిర్మానుష్యంగా మారాయి. హైకోర్టు తీర్పుతో తుళ్లూరు దీక్ష శిబిరంలో రాజధాని రైతులు సంబరాలు జరుపుకున్నారు. హైకోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా వచ్చిందనే ఆనందంతో బాణసంచాలు కాల్చారు. అలాగే న్యాయదేవత విగ్రహానికి పాలాభిషేకం చేసారు అమరావతి రైతులు. 

Video Top Stories