Asianet News TeluguAsianet News Telugu

అమరావతిని అణుబాంబు కూడా ఏమి చేయలేదు...: హీరో శివాజి

రాజధాని కోసం అమరావతి పరిధిలోని మందడంలో కొనసాగుతున్న దీక్షా శిబిరంలో సినీ నటులు శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.

రాజధాని కోసం అమరావతి పరిధిలోని మందడంలో కొనసాగుతున్న దీక్షా శిబిరంలో సినీ నటులు శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెనుక ప్రభుత్వం చేసిన పనులను హామీలను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నెరవేర్చనంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు...తొక్కిపడేస్తారు అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్తారన్నారు. రాజధాని కోసం ఇప్పటికి 437  రోజులు దీక్ష చేశారు.. ఇంకొక 400 రోజులు కూర్చోలేరా? తప్పకుండా ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతున్నాయన్నారు. 

అమరావతికి ఏమి కాదని... తాను చెప్పానంటే అది జరిగి తీరుతుందన్నారు.  అమరావతికి ఏదైనా జరిగే రోజు వస్తే మొదటి తుపాకీ గుండుకి ఎదురు తానే నిలబడతానన్నారు. అమరావతిని అణుబాంబు కూడా ఏమి చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాట వల్లనో, కోపంలోనో ఏదో నిర్ణయం తీసుకుని ఉంటాడు తప్పితే వేరే విధంగా కాదన్నారు. అమరావతి ఒక బంగారు గని... ఇది ఉంటేనే నవరత్నాలు అయినా ఇంకేమైనా మీరు చేసే సంక్షేమాలు నిలబడతాయన్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కి కూడా తెలుసన్నారు శివాజి.