ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ఆమె ఉద్దండరాయుని పాలెం పర్యటనకు వెళ్లాలనే ఉద్దేశంతో సన్నద్ధమవుతుండగా, విజయవాడలోని ఆమె నివాసం వద్ద పోలీసులు మోహరించి ఆమెను బయటికి రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.