Goods Trains Derail: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లా జామ్గావ్ రైల్వే స్టేషన్ యార్డ్లో నిలిచిపోయిన సరుకు రవాణా రైలును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 18 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో కీలకమైన హౌరా-ముంబై మార్గంలో సోమవారం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.